రైతుల ముసుగులో టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులు నాలుగేళ్ల పండుగ చేసుకుంటున్నారు 

అమరావతిలో చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట వేసి నాలుగేళ్లు అయ్యింది 

 కొంత మంది వ్యక్తులు దాన్ని రియల్‌ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు దండుకున్నారు 

 అసైన్డ్‌ భూములకు సరైన ప్యాకేజీ ఇవ్వండి అంటే మీ భూములు లాక్కుంటాం అన్నారు. 

 జగన్‌ గారు వచ్చిన తర్వాత వారికి న్యాయం జరుగుతోంది. 

 చంద్రబాబు కులరాజధాని కడుతున్నాడని, సంపద కొడుక్కి దోచిపెడుతున్నాడని పవన్‌ ఆనాడు అన్నాడు 
 
ఇప్పుడు సిగ్గు శరం, చీమూ నెత్తురు లేకుండా చంద్రబాబు చంకనాకుతున్నాడు: ఎంపీ నందిగం సురేష్‌

 తూర్పుగోదావ‌రి: రైతుల ముసుగులో టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులు నాలుగేళ్ల పండుగ చేసుకుంటున్నార‌ని బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు.  తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వైయ‌స్ఆర్‌సీపీ  సామాజిక సాధికార యాత్రలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ప్రసంగించారు.

- *ఈ దేశం మొత్తం మీద జగన్‌ గారిని భయపెట్టే వాడున్నాడా?* 
- *జగన్‌ గారిని భయపెట్టాలంటే ఎదుటి వ్యక్తీ జగనే అయ్యుండాలి*
- *ఒక తరాన్ని బాగుచేయాలంటే అది జగన్‌ గారికే సాధ్యం*
- *ఇది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల రాజ్యం..జగన్‌ గారిని ఓడిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా?*
- *చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నాడు..?* 
- *ఏ ముఖం పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు ఓటేయమంటున్నాడు?*
- *దళిత బిడ్డ శిరీషకు వచ్చినన్ని ఓట్లు రాలేదు..వీళ్లు జగన్‌ గారిని ఓడిస్తారట?*
- *ఈసారి స్పీడ్‌ పెంచి ఫ్యాన్‌ని 175 మీద తిప్పండి*: ఎంపీ నందిగం సురేష్‌

*బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ప్రసగం:*

అమరావతిని కులరాజధానిగా చేసి దళితులను వేదించారు:
- అమరావతి అనే ఒక కులరాజధాని పెట్టి మన దళిత బిడ్డలను హింసించాడు. 
- నన్ను 48 గంటలు జైళ్లో కూర్చోబెట్టి అనేక రకాలుగా బాధలు పెట్టాడు. 
- చంద్రబాబు మనలాంటి వాళ్లను జైళ్లో కూర్చోబెడితే..నాలాంటి వారిని జగన్‌ గారు పార్లమెంటులో కూర్చోబెట్టారు. 
- ఎవరు గొప్ప అనేది ఆలోచించాలి. చంద్రబాబు మన జీవితాలను వెక్కిరిస్తే..జగన్‌ గారు మన జీవితాలను చక్కదిద్దే పనిలో ఉన్నారు. 
- చంద్రబాబు తన పరిపాలనలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఏం చేశాడో చెప్పాలి. 
- కేవలం 23 సీట్లు వచ్చిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. 
- మరి 151 సీట్లు పొందిన జగన్‌ గారు ఏమనుకోవాలి..? 

రైతుల ముసుగులో ఉన్న టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులు నాలుగేళ్ల పండుగ చేసుకుంటున్నారు:
- 2018లో పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు దొంగ అన్నాడు. చంద్రబాబు కులరాజధాని కడుతున్నాడు..సంపద కొడుక్కి దోచిపెడుతున్నాడు అన్నాడు. 
- ఇప్పుడు సిగ్గు శరం, చీమూ నెత్తురు లేకుండా చంద్రబాబు చంకనాకుతున్నాడు. 
- అమరావతి ఉద్యానికి నాలుగేళ్లు అంటూ రైతుల ముసుగులో ఉన్న టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులు పండుగ చేసుకుంటున్నారు. 
- చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట వేసి నాలుగేళ్లు అవుతోంది. 
- చంద్రబాబు లక్షల కోట్ల స్కాంలు చేశాడు. దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపాడు. 
- ఈ మధ్యకాలంలో ఆయన చేసిన తప్పులకు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు కూడా వెళ్లాడు. 
- అమరావతి ప్రాంతంలో ఒక కులానికి చెందిన కొంత మంది వ్యక్తులు కలిసి దాన్ని రియల్‌ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు సంపాదించుకున్నారు. 
- ఆ పార్టీకి చెందిన నారాయణ, పుల్లారావు లాంటి వ్యక్తులు అక్కడ దోచుకుతిని భూములన్నిటిని దోచేశాడు. 
- అసైన్డ్‌ భూములకు సరైన ప్యాకేజీ ఇవ్వండి అంటే మీ భూములు లాక్కుంటాం..ఐదో పదికో అమ్ముకోండి అని చంద్రబాబు అన్నాడు.
- జగన్‌ గారు వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి న్యాయం జరుగుతుందో అంతా చూస్తున్నారు. 
- అసైన్డ్‌ భూములున్న వారికి ఆ భూములు అప్పజెప్పేందుకు జగన్‌ గారు కృషి చేస్తున్నారు. 
- జగన్‌ గారు వచ్చిన తర్వాత రాక ముందు గమనిస్తే చంద్రబాబు దరిద్రం పట్టినట్లు పట్టాడని ప్రజలు భావించాడు. 

జగన్‌ గారిని ఓడించే దమ్ము వాళ్లకు ఉందా?:
- గత నాలుగున్నరేళ్లలో జగన్‌ గారి సంక్షేమ పాలనను, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 
- చంద్రబాబు 14 ఏళ్లు పాలించి 2 ఎకరాలుగా ఉన్న వ్యక్తి ఆరు లక్షల కోట్లు సంపాదించాడు. 
- ముఖ్యమంత్రి పదవి సంపాదించుకోవడానికి అని చంద్రబాబు భావిస్తే..జగన్‌ గారు తన పాలనతో ప్రజలు బాగుపడాలని ఆకాంక్షించారు. 
- విద్య, వైద్యంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. 
- ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు, ఆయన కూటమి కలిసి జగన్‌ గారిని ఓడించాలని చూస్తున్నారు. 
- గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా? జగన్‌ గారిని ఓడించే దమ్ము వాళ్లకు ఉందా? 
- ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి జగన్‌ గారు మళ్లీ నాకో ఛాన్స్‌ ఇవ్వండి అంటున్నాడు. 
- చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నాడు...? 
- ఏం చూసి పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు ఓటు వేయమని చెప్తున్నాడో ఆలోచించాలి. 

 జగన్‌ గారితోనే మన జీవితాల్లో వెలుగులు:
- జగన్నన్న వచ్చిన తర్వాతనే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాగున్నారు. 
- చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే మన జీవితాలను వెక్కిరిస్తారు. 
- చంద్రబాబు మన జీవితాల్లో వెలుగు ఆర్పేస్తే...జగన్‌ గారు వచ్చి వెలుగులు నింపారు. 
- మన బిడ్డలు ఇంగ్లీషు మీడియం చదవడానికి వీళ్లేదని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడు. 
- 31 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్లు కట్టిస్తుంటే కోర్టులకెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. 
- చంద్రబాబు ఈ రాష్ట్ర సంపద నీ బాబుగాడిదా? జగన్‌ గారు పేదలు బాగుండాలని గొప్ప పరిపాలన చేస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు. 
- చంద్రబాబు అనే వ్యక్తి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 

 జగన్‌ గారిని భయపెట్టాలంటే ఎదుటి వ్యక్తీ జగనే అయ్యుండాలి:
- ఆయన కొడుకు హాఫ్‌ మైండ్‌ గాడు జగన్‌ గారిని భయపెడతాడట. 
- ఈ దేశం మొత్తం మీద జగన్‌ గారిని భయపెట్టే వాడున్నాడా? 
- లోకేశ్‌..మానాన్నను చూసి 40 రోజులైంది అని ఏడ్చావు చూడు..అదీ భయపెట్టడమంటే. 
- సోనియా గాంధీనే ఎదిరించి సొంత పార్టీ పెట్టిన నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు. 
- జగన్‌ గారిని భయపెట్టాలంటే..ఎదుటి వ్యక్తి కూడా జగనే అయ్యి ఉండాలి. 

 ఒక తరాన్ని బాగుచేయాలంటే అది జగన్‌ గారికే సాధ్యం: 
- చంద్రబాబు బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని కంపల్లో, వరదల్లో మునిగిపోయే చోట పెట్టాలని చూశాడు. 
- జగన్‌ గారు వచ్చి విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్లతో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెడుతున్నారు. 
- విజయవాడలో కొండపై అమ్మవారు..విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ గారు ఫేమస్‌. 
- ఒక దినం గడవాలంటే చంద్రబాబు..సాయంత్రానికి రూ.500 ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. 
- ఒక తరం, ఒక జీవితం బాగుపడాలంటే మాత్రం ఒక్క జగన్‌గారికే సాధ్యం. 
- అంబేద్కర్‌ విగ్రహం తన వేలును తాడేపల్లి వైపు చూపిస్తోంది. 
- తన ఆశయాలను నెరవేర్చే నాయకుడు తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తున్నాడు. 
- ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటాడా అని చంద్రబాబు అన్నాడా లేదా? బీసీల బట్టలు ఊడదీసి కొడతానన్నాడు. 
- కరోనా సమయంలో ఈ రాష్ట్రం ఏమైపోతుందా అని మనందరం బాధ పడుతుంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఈ రాష్ట్రం వైపే చూడలేదు. 
- ఈ రాష్ట్రాన్ని, మన ప్రాణాలను కాపాడిన వ్యక్తి జగన్‌ గారు. 
- ఈ సారి ఎన్ని కుయుక్తులు పన్ని వచ్చినా మా పిల్లలు బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్‌ గారే ఉండాలని చెప్పండి. 
- మహిళలకు ఈ మధ్య కాలంలో పార్లమెంటులో రిజర్వేషన్లు పెట్టారు. 
- వారికంటే ముందే మన రాష్ట్రంలో జగన్‌ గారు ఆడబిడ్డలకు రిజర్వేషన్‌ అమలు చేసిన నాయకుడు. 

 ఇది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల రాజ్యం..జగన్‌ గారిని ఓడిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా?: 
- జగన్‌ గారు ఇచ్చే పథకాలే మీరు ఇచ్చేటట్లయితే మీరెందుకు..? జగన్‌ గారు ఉన్నారుగా? 
- తెలంగాణలో ఉంటూ వీరంతా ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. 
- తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌కు హెలికాఫ్టర్, గన్‌మెన్లను ఇచ్చి ప్రచారం చేయమని పంపాడు. 
- ఈ మధ్య నరేంద్రమోడీ ఫోన్‌ చేసి నీకు హెలికాఫ్టర్‌ అనవసరంగా పెట్టాం కదా అని అన్నాడట. 
- తెలంగాణలో మన దళిత బిడ్డ శిరీష పోటీ చేస్తే ఆమెకు వచ్చినన్ని ఓట్లు పవన్‌ కల్యాణ్‌కు రాలేదు. వీళ్లందరూ కలిసి జగన్‌ గారిని ఓడిస్తారట...
- మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు సింగిల్‌గా పోటీ చేస్తే మీ బతుకులు బయటపడుతాయి. 
- ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం...వీళ్లంతా కలిసి జగన్‌ గారిని ఓడిస్తాం అంటే చూస్తూ ఊరుకుంటామా? 
- మీరంతా కలిసి ఫ్యాన్‌ 151 స్పీడ్‌ మీద తిప్పారు...మనందరం కలిసి ఇప్పుడు 175 మీద తిప్పుదాం. 

Back to Top