కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష 

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ హాజరయ్యారు. జిల్లాల వారీగా చేపడుతున్న కరోనా టెస్టులు, మూడవ విడత రేషన్‌ పంపిణీ, నిత్యావసర సరుకుల సరఫరా, వ్యవసాయ పనులు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. 

Back to Top