సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కురువ సంఘాల ప్ర‌తినిధులు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని  హిందూపురం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వ‌ర్యంలో మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు క‌లిశారు. ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి త‌హ‌శీల్దార్ పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంఘం ప్ర‌తినిధులు కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించారు.  తమ కులస్ధులు ఎదుర్కుంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయ‌న సానుకూలంగా స్పందించారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు సుంకన్న, శివలింగ, సోమలింగ, సాయిరామ్, మద్దిలేటి ఉన్నారు.

Back to Top