సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారంటే.. చేస్తారంతే

మంత్రి పేర్ని నాని

పశ్చిమగోదావరి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పారంటే..దాన్ని చేసి తీరుతార‌ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడానికే ముఖ్యమంత్రి  నవరత్నాలను ప్రవేశపెట్టారని చెప్పారు. గురువారం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు.‘ఇప్పటికే దశలు వారీగా బ్రాందీ షాపులను తగ్గిస్తున్నారు. రాబోయే కాలంలో పూర్తిగా బ్రాందీ షాపులను నిర్మూలన చేస్తారు. మద్యానికి బానిసలయినా కుటుంబంలో పిల్లలు కార్మికులుగా చేస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ‘అమ్మ ఒడి’ పథకం రూపుదిద్దుకుందని చెప్పారు.  పేదవారి సొంతింటి కలను నెరవేర్చారు. సుమారు 10 కోట్ల రూపాయలతో 30 లక్షల 54 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే.. 90 రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తాం. ఇప్పటికే సీఎం వైయ‌స్‌ జగన్‌ 95 శాతం హామీలను అమలు చేశారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 

Back to Top