వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
సీఎం వైయస్ జగన్ చెప్పారంటే.. చేస్తారంతే
31 Dec 2020 5:36 PM
మంత్రి పేర్ని నాని
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే..దాన్ని చేసి తీరుతారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడానికే ముఖ్యమంత్రి నవరత్నాలను ప్రవేశపెట్టారని చెప్పారు. గురువారం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు.‘ఇప్పటికే దశలు వారీగా బ్రాందీ షాపులను తగ్గిస్తున్నారు. రాబోయే కాలంలో పూర్తిగా బ్రాందీ షాపులను నిర్మూలన చేస్తారు. మద్యానికి బానిసలయినా కుటుంబంలో పిల్లలు కార్మికులుగా చేస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ‘అమ్మ ఒడి’ పథకం రూపుదిద్దుకుందని చెప్పారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చారు. సుమారు 10 కోట్ల రూపాయలతో 30 లక్షల 54 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే.. 90 రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తాం. ఇప్పటికే సీఎం వైయస్ జగన్ 95 శాతం హామీలను అమలు చేశారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.