ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేయాలి

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
 

 అమరావతి: ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని  రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కేవలం ముడు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలను సీఎం వైయస్‌ జగన్‌ భర్తీ చేశారని ప్రశంసించారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘గ్రామ సచివాలయ వ్యవస్థ’ను తీసుకువచ్చామని తెలిపారు. అక్టోబర్‌ పది నుంచి ‘వైయస్‌ఆర్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. 

Back to Top