విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ఎన్ఐఆర్ విభాగం ఆధ్వర్యంలో బస్సు యాత్రను ప్రారంభించారు. సోమవారం విశాఖ నుంచి బస్సు యాత్రను మొదలుపెట్టారు. రావాలి జగన్..కావాలి జగన్ అనే నినాదంతో ఈ యాత్ర సాగుతుందని ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతామని ఆయన తెలిపారు.