ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల సాయం
25 Jan 2021 3:19 PM
కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు ఆళ్ల నాని, సుచరిత
వ్యాక్సినేషన్ వల్ల ఎవ్వరూ మరణించలేదన్న నాని
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల తర్వాత పక్షవాతానికి గురైన బొక్కా విజయలక్ష్మి(45) అనే ఆశా వర్కర్ నిన్న ఉదయం ప్రాణాలు కోల్పోయింది. దీంతో తాడేపల్లి మండలం పెనుమాకలోని ఆమె ఇంటికి ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆళ్ల నాని, సుచరిత వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రేపటిలోగా వారి కుటుంబానికి ఈ పరిహారం అందుతుందని మంత్రులు చెప్పారు. అలాగే, వారికి ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఆళ్ల నాని అన్నారు.
అయితే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వల్ల ఎవ్వరూ మరణించలేదని మంత్రి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలను గుర్తించలేదని తెలిపారు. వ్యాక్సిన్ వేసే ప్రక్రియ సురక్షితంగా కొనసాగుతుందని చెప్పారు. విజయలక్ష్మి పోస్టు మార్టం నివేదిక తమకు అందగానే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.