మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ముసలి నక్క @ 73..బతికుండగానే భూతం అవతారం!
21 Jun 2022 4:25 PM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. కోరికలు తీరకుండానే పోయినవారి ఆత్మ పిశాచి రూపంలో తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ముసలి నక్క- 73, బతికిండగానే భూతం అవతారం ఎత్తి జనాన్ని హింసిస్తున్నాడు. డెకాయిట్ల, భూ కబ్జాదారులను కాపాడటమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. “బ్లాక్” మ్యాజిక్ స్లీపర్ సెల్స్ ఆయన బలం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రాష్ట్ర అప్పుల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు, ఎల్లో కులమీడియా కథనాల్లో వాస్తవం లేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2021–22లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో అతితక్కువగా ద్రవ్యలోటు (నికర అప్పు) 2.10 శాతం ఉన్నట్లు తేలిందంటూ అంతకుముందు చేసిన ట్వీట్లో విజయసాయిరెడ్డి వెల్లడించారు.
కోటి మంది కళ్లల్లో వెలుగులు
ఈ ఒక్క ఫోటో చాలు నక్క నాయుడు జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవటానికి. ఇలాంటి కోటి మంది కళ్లల్లో వెలుగులు నింపారు జగన్ గారు. పేదల నోరుకొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టిన చరిత్ర గుంట నక్కది. 1998లో డిఎస్సీలో అర్హత సాధిస్తే నియామకాలు నిలిపేసి కక్షసాధించాడు. వాళ్ల భవిష్యత్తును చిదిమేశాడు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.