సింగిల్ ఎజెండాతో బాబు తుపాకీ పట్టుకు తిరుగుతున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేశారు.  ఫలానా పథకం ప్రవేశపెట్టండి, డ్యాములు కట్టండి, రోడ్లు వేయండని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. చంద్రబాబు మాత్రం ఇంకే సమస్యలు లేనట్టు తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రాజధాని అక్కడే ఉంచాలన్న సింగిల్ ఎజెండాతో తుపాకీ పట్టుకు తిరుగుతున్నాడని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నిబద్ధతకు ఇదే నిదర్శనం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయ‌స్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల. ఉద్యోగులకు హెల్త్‌ స్కీం కింద 31.97 కోట్లు విడుదల. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమ‌ని అంత‌కు ముందు మ‌రో ట్విట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top