గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి 

భువనేశ్వర్ః ఏపీకి నూతన గవర్నర్‌గా నియమితులయిన విశ్వభూషణ్‌ హరిచందర్‌తో వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.భువనేశ్వర్‌లో ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు.శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయిన సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రజల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

Back to Top