నెల్లూరు జిల్లా: సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అన్నీ నేర సంస్కృతిలే చంద్రబాబులో ఉన్నాయని వైయస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన చాలా హత్యలకు కారణం చంద్రబాబే అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురపించారు . నెల్లూరు లోక్సభ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ ప్రచారంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై జరిగిన దాడులకు కారకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అన్నారు. . ఆయన ప్రభుత్వంలో ఎంతమందిని హత్య చేయించాడో అందరికీ తెలుసన్నారు. కానీ, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు..