టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
18 Nov 2022 12:02 PM
జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
నంద్యాల: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిల్పా సహకారంతో ఏర్పాటు చేసిన కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని, శాంతి కపోతాలు ఎగురవేశారు. క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసి ప్రోత్సహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.25 వేల నగదు బహుమతులను అందజేస్తామన్నారు.