విద్యార్థులకు ఇచ్చిన హామీని వైయస్‌ జగన్ నిలబెట్టుకున్నారు

ఎమ్మెల్యే ఆర్కే రోజా 
 

చిత్తూరు: పాదయాత్రలో లక్షలాది మంది విద్యార్థులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ నిలబెట్టుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 12 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు పడతాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి సమానమైన, న్యాయమైన విద్య అందుతుందని తెలిపారు. మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నట్టు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై  ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.
 

Back to Top