తాడేపల్లి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తామని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. *ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ మావే:* - రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అవన్నీ మేమే గెలుచుకుంటాం - స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది - మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఉన్నాయి - వీటిలో కూడా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని మా నాయకుడు మాకు దిశానిర్ధేశం చేశారు - సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు దీనిపై దృష్టి పెట్టాలి - ప్రజలకు సంబంధం లేని ఎన్నికలైనా మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సిఎం చెప్పారు - గడప గడపకు వెళ్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలు గెలిచేలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనిచేయాలని చెప్పారు - కొంత మంది కొంత తక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా సరిచేసుకోవాలని చెప్పారు - ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేనపథ్యంలో 175కి 175 నియోజకవర్గాల్లో గెలవాలని ముఖ్యమంత్రి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు - పోటీ చేసే వారు, ఉన్న ఎమ్మెల్యేలు దీనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని సూచించారు - మాకున్న సర్వేల ప్రకారం 175 సీట్లు గెలవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది *175కి 175 సీట్లు గెలిచి చూపిస్తాం:* - చంద్రబాబు, లోకేశ్, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు లాంటి పనికి మాలిన వాళ్లు సర్వేలంటూ మొరుగుతారు - ఎవరికీ తెలియని సమాచారం కూడా ఏబీఎన్కు తెలిసినట్లు రాసేస్తాడు - ఐప్యాక్ వాళ్లు సర్వే చేస్తారా..చేస్తారని రాధాకృష్ణకు ఎవరు చెప్పారు..? - ఐప్యాక్ వాళ్లు స్ట్రాటజీ ఇస్తారు...ఎలా సరిచేసుకోవాలి అనేది చెప్తారు - ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టాస్క్ను మేం కంప్లీట్ చేస్తాం - 175కి 175 సీట్లు గెలిచి చూపిస్తాం - కుక్కకాటుకు చెప్పుదెబ్బలా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు పచ్చమీడియాకి జగనన్న అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం *చంద్రబాబు గ్రాఫిక్స్తో ఎలా మభ్యపెట్టాడో కూడా చెప్తాం:* - మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం - ఇప్పటికే గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు నియామకం చేపట్టాము - వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది - మన హాయాంలో ఎటువంటి మార్పులు చేపట్టామో ప్రజల్లోకి తీసుకెళ్లామనేది గృహ సారథులు ప్రతి ఒక్క కుటుంబానికి వివరిస్తారు - గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్ తో ఎలా మభ్యపెట్టాడో కూడా వివరిస్తాం - రాష్ట్రంలో దోచుకున్న డబ్బును అతని వాళ్లకు ఎలా పంచిపెట్టాడు అనేది కూడా చెప్తాం - కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్ లేదు.. - అంతేకాకుండా కోడ్ ఉన్న జిల్లాల్లో కొన్ని చోట్ల 23వ తేదీ నాటికి ఏకగ్రీవం అయిపోతాయి - ఈ లోపు గృహసారథుల నియామకం, సమావేశాలు, శిక్షణ వంటి పనులు పూర్తి చేసుకుంటాం - వీటితో పాటు పట్టభద్రులు, టీచర్స్ నియోజకవర్గాల్లోనూ మేం తిరిగి ప్రచారం చేస్తాం *చంద్రబాబు వేసిన పుస్తకం చలిమంటకు కూడా పనికి రాదు:* - ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది..ఇంకా ఐటీ నావల్లే వచ్చిందని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరు. - మరో వైపు చెత్త పుస్తకాలు వేస్తే ఎవడు చూస్తాడు..అవి చలిమంట వేసుకోడానికి కూడా పనికిరావు - ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోజూ రాసేది అదే కదా..! - గతంలో ఇలాంటివి రాసీ రాసీ, వీళ్లంతా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగారా..? - "ఎన్టీఆర్ని తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు... "అన్నది రాయమనండి - తడి గుడ్డ ఇచ్చింది రామోజీరావు .. కాళ్లు పట్టుకుంది రాధాకృష్ణ... అనేదానిపై పుస్తకాలు వేయమనండి - గొంతు నులిమింది చంద్రబాబు నాయుడు అనేది రాయాలి - తండ్రికి వెన్నుపోటు పొడుస్తుంటే చూసి... ఆనందించింది ఎవరు? అనేది పుస్తకాలు వేయాల్సింది. *మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది...:* - మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ని లాక్కున్నాడు.. - దేనికీ పనికి రాని పప్పుగాడిని ఓ నాయకుడిలా ప్రజల మీదకు వదిలాడు - రామారావు గారిని చంపితే.. ఇవన్నీ చంద్రబాబుకు వచ్చాయి. - మరి ఇవన్నీ రావడానికి, వైయస్ఆర్సీపీని వివేకానందరెడ్డి గారు స్థాపించారా..?... లేదు కదా..?. - పార్టీని జగన్మోహన్రెడ్డిగారు పెడితే.. వివేకానందరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి...విజయమ్మ గారిపైనే పోటీ చేశారు. -అయినా వివేకానంద రెడ్డి గారి లాంటి మంచి మనిషిని, మనసున్న నాయకుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? *వివేకా ఆస్తులు కూతురు, అల్లుడి పేరు మీదకు ఎలా వచ్చాయ్..?:* - ఆయన చనిపోయిన రోజుకి వివేకా పేరున ఐదుపైసలు ఆస్థి ఉందా..? - ఆయన ఆస్థి మొత్తం కూతురు, భార్య, అల్లుడి పేర్ల మీద ఎలా బదిలీ అయ్యాయి? - ఎందుకు ఆ ఆస్తులన్నీ బదిలీ అయ్యాయో తెలియాలి. - చంద్రబాబు లాంటి లఫూట్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, కేసును తారుమారు చేస్తాడని సీబీఐ విచారణ కోరాం. - మా ప్రభుత్వం వచ్చాక మేం విచారించుకుంటాం అని సీబీఐ విచారణ వద్దన్నాం - సీబీఐ ఊళ్లోకి రావద్దంటూ చెప్పింది, జీవో ఇచ్చింది చంద్రబాబే.. - అలా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా వివేకానందరెడ్డి గారిని చంపించింది చంద్రబాబే అని మా అనుమానం. *ఎన్టీఆర్ గొంతు కాదు...లోకేశ్ కు ఖర్జూరనాయుడు గొంతు వచ్చి ఉంటుంది..:* - తాత గొంతు వచ్చిందా లోకేష్ ...? రామారావు గారు బతికి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు - పొరపాటున కర్జూరనాయుడు గొంతు వచ్చింది అని చెప్పబోయి రామారావు గారి పేరు చెప్పి ఉంటాడు - లోకేశ్ మందమతి కదా...ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి ఉంటాడు - టీచర్స్లో వ్యతిరేకత ఉందని ఎవరైనా టీచర్స్ వచ్చి చెప్పారా..? - వారిలో అనేక యూనియన్లు ఉన్నాయి...టీడీపీకి అనుబంధ యూనియన్లు ఉంటాయి..వైయస్ఆర్సీపీ యూనియన్లూ ఉంటాయి - అందరూ కలిసి వచ్చింది ఎప్పుడు..? మాకు కావాల్సిన మెజార్టీ ఓటు - నూటికి నూరు శాతం ఓట్లు ఎవరికీ రాదు కదా