అన్నమయ్య జిల్లా: కుప్పానికి నీళ్లివ్వలేని చంద్రబాబు రాయలసీమకు ఏం చేస్తారని, సీమకు ద్రోహం చేసిన మీరు.. మిషన్లు పెడతారా..!? అని అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని లోకేష్..చంద్రబాబు ఏం చేస్తారయ్యా..? , ఈప్రాంతానికి మీరు చేసిన పాపానికి పచ్చాత్పాపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ మా పరిగణలోనే లేడు..మా నినాదం 175కు 175 సీట్లు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మిడిమిడి జ్ఞానంతో లోకేశ్..:
- లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో, వ్యక్తిగత దూషణలతో, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా పాదయాత్ర చేస్తున్నాడు.
- పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మమేకం అవ్వడం.
- కానీ సాయంత్రం 4 గంటల వరకూ టెంటులోనే ఉంటున్నాడు. రోజుకి 19 గంటలు ఆయన టెంటులోనే గడుపుతున్నాడు.
- ఒక అరగంట నడిచి...తరలించిన జనాలతో ఒక మీటింగులో పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతున్నాడు.
- కేవలం ఆరోపణలు, దూషణలకే పరిమితమై వెళ్తున్నాడు.
- కడపలో రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఏదో చేస్తానని మాట్లాడాడు.
- 1995లో మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు...27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారు..?
- మేం ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు ఇది చేశాం అని చెప్పుకోలేకపోతున్నారు.
- ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేసేస్తారట...
- అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గురించి ఆలోచించకుండా, సీమవాసులంతా ఫ్యాక్షనిస్టులని, రౌడీలని దిగజారుస్తూ మాట్లాడారు.
- రాయలసీమ వ్యక్తుల మనోభావాలను కించపరిచిన మీరు ఈ రోజు సీమలో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో సమాధానం ఇవ్వాలి.
వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే సీమ అభివృద్ధి:
- రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే వైయస్ఆర్కు ముందు..వైయస్ఆర్ తర్వాత అనేది మాట్లాడుకోవాలి.
- వైయస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాయలసీమలో పురోగతి కనిపించింది.
- తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు.
- హంద్రీనీవా, గాలేరు నగరిని 80 శాతం పూర్తి చేసిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
- చంద్రబాబు అధికారంలో ఉండగా హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను సాగునీటి ప్రాజెక్టులుగా వద్దని, తాగునీటి ప్రాజెక్టులు మార్చాలని జీవోలు ఇచ్చాడు.
- 2004లో ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ బాధ్యత చేపట్టిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసి సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి 80 శాతం పూర్తి చేశాడు.
- ఆ తర్వాత నువ్వు నడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పూర్తి చేయలేదు.
- వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాకనే గండికోట, చిత్రావతిలో పూర్తిగా నీళ్లు నిలబెట్టుకుంటున్నామంటే అది జగన్ గారి ఘనత.
- రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కేవలం వైయస్ కుటుంబానికి మాత్రమే ఉంది.
- లోకేశ్ తాను చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాడు...ఆయన్ని ఒక జోకర్గా ప్రజలు భావిస్తున్నారు.
- అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టుకు రూపకల్పన చేయలేని వ్యక్తి ఇప్పుడొచ్చి ఏదో చేస్తాడంటే నమ్మేది లేదు.
కర్నూలు హైకోర్టుకు అడ్డుపడింది మీరు కాదా..?:
- పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సీమలో జిల్లాలు పెంచారు. కర్నూలులో మేం హైకోర్టు పెడతామంటే మీరే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్నారు...
- ఇప్పుడు అక్కడ హైకోర్టు బెంచ్ పెడతామని అవమానం చేస్తున్నావు..
- అంటే కర్నూలులో హైకోర్టును తిరస్కరిస్తున్నట్లు ఒప్పుకుంటున్నారు.
- ఈయన అధికారంలోకి వస్తే స్పోర్ట్స్ హబ్ చేస్తాడట...వైయస్ఆర్ గారు ఎప్పుడో ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ పెడితే..జగన్ గారు దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు.
- అనేకమైన ఆస్పత్రులు సీమకు తీసుకొచ్చింది వైయస్ కుటుంబమే.
- కేవలం విమర్శలతో కాలం వెళ్లబుచ్చాలని మీరు చూస్తున్నారు.
- 1994 నుంచే హంద్రీనీవా, గాలేరునగరి చేసి ఉంటే బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ద్వారా సీమకు నీటి కేటాయింపులు కూడా వచ్చి ఉండేవి.
- మీరు రాయల సీమ ద్రోహులు కాదా..?
- సీమ గుండె చప్పుడు లాంటి పోతిరెడ్డిపాడును మహనీయుడు వైయస్ రాజశేఖరరెడ్డి గారు యుద్ధప్రాతిపదికన రెండేళ్లలో పూర్తి చేశారు.
- రాయలసీమ వాసులు చిరస్మరణీయంగా దీన్ని గుర్తు పెట్టుకుంటారు.
- ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమ బాగుపడుతుందనే దుర్భుద్ధితో కృష్ణా బ్యారేజీపై నీ ఎమ్మెల్యేలతో దర్నా చేయించింది నువ్వు కాదా..?
- వైయస్ జగన్ గారు సీమకు మంచి చేయాలని పోతిరెడ్డిపాడు విస్తరణ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నిస్తే సిగ్గు లేకుండా ఈ వ్యక్తి ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో సీమకు నీళ్లు తరలించుకుపోతున్నారని లేఖలు రాయించారు.
కుప్పానికి నీళ్లివ్వలేని నువ్వు రాయలసీమకు ఏం చేస్తావ్..?:
- కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్గా నడుపుతూ కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
- నీ మాటలు, నీ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు లోకేశ్.
- అలాంటి లోకేశ్ నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు.
- కుప్పంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ ఇప్పటి వరకూ లేదు.
- కుప్పానికి నీళ్లివ్వలేని నువ్వు రాయలసీమకు ఏం చేస్తావ్..?
- ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నువ్వు నీ తండ్రి ఏం చేస్తారయ్యా..?
- 3 సార్లు రాయలసీమ వాసులు నీకు అవకాశం ఇస్తే వారి మనోభావాలను దెబ్బ తీసిన వ్యక్తులు మీరు.
- ఈ రోజు మీరొచ్చి ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరు
- వైయస్ జగన్గారు వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ, రెవిన్యూ డివిజన్ చేశారు.
- ఇక నువ్వు రాయలసీమకు ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారు..?
- ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా పూర్తిచేయలేకపోతే జగన్ గారు పూర్తి చేశారు.
- తాత్కాలిక భవనాలని రాజధాని లేకుండా చేసింది నువ్వే.
- వైజాగ్ను అభివృద్ధి చేద్దామంటే ప్రతి రోజూ స్టేలు తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుది.
- విశాఖ అభివృద్ధి చెందకూడదు...అమరావతిలో ఏమీ జరగకూడదు..కర్నూలుకు హైకోర్టు రాకూడదు..ఇదే బాబు ఆలోచన.
- మేనిఫెస్టోలో ఏమి చెప్పాడో దాన్ని శిరసావహిస్తూ 99 శాతం పూర్తి చేసిన వ్యక్తి వైఎస్ జగన్గారు.
- పీఆర్సీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసిన జగన్ గారిని అభినందించాలి.
లోకేశ్వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే:
- ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్లు మిడిమిడి జ్ఞానంతో ఏదో సాధిస్తున్నాను అనుకంటే పొరపాటు.
- కడప నగరం, వైయస్ఆర్ జిల్లాలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది.
- నువ్వు అవకాశం ఉన్నపుడు ఏమీ చేయకుండా ఇవాళ డిక్లరేషన్ అంటున్నాడు.
- సామాజిక వర్గ మీటింగులు పెట్టుకుని రెచ్చగొడుతున్నావు..
- ఏ ఆర్హతతో నువ్వు మాట్లాడుతున్నావ్ లోకేశ్..? ఏ అంశంపైనా నీకు మాట్లాడే అర్హత లేదు..
- కొప్పర్తి ఇండస్ట్రియల్గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి జగన్ గారు.
- లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా అక్కడ చర్యలు చేపట్టారు.
- ఆనాడు స్టీల్ ప్లాంటు పెడుతుంటే నెమళ్లు నాట్యం అంటూ అడ్డుకున్నావ్.
- వైయస్ జగన్గారు జింధాల్ తో మాట్లాడి మళ్లీ ఇప్పుడు దాన్ని ఒక రూపునకు తీసుకొస్తున్నారు.
మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..?:
- దాన్ని పాదయాత్ర అంటారా..? కేవలం అది ఈవెంట్ మేనేజ్మెంట్.
- ఈ ప్రాంతం మీ వల్ల ఎంత నష్టపోయింది అనేది మీరు ఆలోచన చేస్తూ పాదయాత్ర చేయాలి.
- మీ 15 ఏళ్ల పరిపాలనలో సీమ ప్రజలకు మీరు చేసిన అన్యాయానికి క్షమాపణలు చెప్పుకుంటూ తిరగాలి.
- ఇచ్చిన మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..?
- ఆయన చేసిన మొదటి సంతకాలు ఏమయ్యాయి..?
- ఇప్పుడు మళ్లీ ఆల్ ఫ్రీ బాబులా హమీలిస్తున్నాడు.
- వైయస్ జగన్ గారు ఇస్తున్న స్కీమ్ల పేరు మార్చి హామీలిస్తే సరిపోదు.
- ఈ బాధ్యత లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో ఆలోచించండి.
- సిగ్గు లేకుండా పిల్లల్ని పుట్టించుకోండి..ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానంటాడు.
- గతంలో ఇదే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే వెనిజులా, శ్రీలంక అయిపోతుంది అన్నాడు.
- ఇప్పుడు అవే హామీలిచ్చి ఎల్లో మీడియాతో భజన చేయించుకుంటున్నాడు.
- వైయస్ జగన్ గారు మీకు మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అంటున్నారు.
- ఈ మాట చంద్రబాబు చెప్పగలడా..?
తండ్రీ కొడుకులది డ్రామా పాదయాత్ర:
- అన్ని రంగాల్లో రాయలసీమను మోసం చేసి, సామాజిక వర్గాలను కించపరిచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
- పాదయాత్ర అంటే వైయస్ఆర్, వైయస్ జగన్ గారిని చూసి నేర్చుకో లోకేశ్.
- నీ తండ్రిలా అప్పటికప్పుడు మట్టిరోడ్లు వేయించి రాత్రి పూట నడవడం కాదు.
- తండ్రీ కొడుకులది డ్రామా పాదయాత్ర.
- లోకేశ్ పాదయాత్ర రెండు రోజుల్లో రాయలసీమను వీడనుంది.
- మీరు చేసిన తప్పునకు ఈ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలి.
- సీమ వాసులను ఫ్యాక్షనిస్టులు అన్నాం..క్షమించండి అని కోరండి.
- పోతిరెడ్డిపాడును ఆనాడు వ్యతిరేకించాం...సీమ ప్రజలు క్షమించండి అని చెప్పి వెళ్లు.
- నేను పదేళ్లలో చేయకపోవడం వల్లే సీమకు నీటి కేటాయింపులు రాలేదని క్షమాపణ చెప్పి వెళ్లాడు.
- కర్నూలు ఎయిర్ పోర్టు అని శంకుస్థాపన చేసి ఏదో చేసినట్లు చెప్పుకుంటున్నారు.
- దానికి రూ. 280 కోట్లలో రూ. 180 కోట్లు జగన్ గారే విడుదల చేసి ముందుకు సాగించారు.
- ఓర్వకల్లులో నిర్మిస్తున్న పారిశ్రామికవాడ, కొప్పర్తి సెజ్, శ్రీ సిటీల్లో మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో...మా హయాంలో ఎన్ని వచ్చాయో చూసుకో.
- నీ ముక్కు నేలకు రాసి...రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
- చంద్రబాబు కూడా సీమకు వచ్చి కొడుకుతో పాటు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి.
సామాజికవర్గాల ప్రస్థావన చంద్రబాబుతోనే ప్రారంభం:
- గత నాలుగేళ్లలో రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడారు.
- అధికారంలో ఉన్నపుడు పత్తికొండ నారాయణరెడ్డిని, రాప్తాడు ఎమ్మార్వో ఆఫీసులో రెడ్డి సామాజిక వర్గ వారిని హత్యలు చేయించింది వీళ్లు కాదా..?
- వందల మంది రెడ్డి సామాజికవర్గీయులను హత్యలు చేసిన వీళ్లు ఇప్పుడు రెడ్లపై ప్రేమ ఒలకబోస్తే ఎట్లబ్బా..?
- సామాజిక వర్గాల గురించి మాట్లాడే పరిస్థితి చంద్రబాబుతోనే ప్రారంభం అయ్యింది.
- మేం ప్రతి సామాజికవర్గాన్నీ సమానంగా చూస్తున్నాం. అన్ని వర్గాలకూ మేం సంక్షేమాన్ని అందిస్తున్నాం.
- అన్ని వర్గాలకు శ్యాచురేషన్ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్నాం.
- అన్ని కులాలను సమానంగా చూసేవాడు రాజకీయ నాయకుడు.
- కుట్రపూరితంగా అధికారంలోకి రావాలని సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టడం కాదు.
- అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడిపించే వాడు అసలైన నాయకుడు.
- సినిమాల్లో వాళ్లకి తెలిసిన వారితో దొంగలు, దోపిడీదారులుగా చిత్రీకరించింది మీరే కాదా..?
సీమను కించపరిచి మళ్లీ డిక్లరేషనా..?:
- చేసిన తప్పునకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాం. కానీ ఆయనేదో పరిణితి చెందాడని, ఆయనకు భయపడి కాదు.
- ఈప్రాంతానికి చేసిన పాపానికి పచ్చాత్పాపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
- లోకేశ్ మా పరిగణలోనే లేడు..మా నినాదం 175 సీట్లే.
- చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్ ఉంది. రాజశేఖరరెడ్డిగారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ వద్దు..ఫ్యాషన్ ముద్దు అంటూ నిర్మూలించారు.
- పరిటాల రవి హాయాంలో వేలమందిని మాయం చేసేశారు. ఎక్కడ చూసిన బాంబులు వేయించింది మీ చరిత్ర.
- ఫ్యాక్షన్ రూపుమాపింది వైఎస్ రాజశేఖరరెడ్డి గారే.
- అక్కడెక్కడో ట్రైన్ కాలిపోతే రాయలసీమ గూండాలు అన్నది మీరు కాదా..?
- ఈ రోజు మీకు సీమ డిక్లరేషన్ చేసే అర్హత ఉందా..?
- భవిష్యత్తులో ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా సినిమాల్లోనైనా, ఎక్కడైనా సరే సీమ సంస్కృతి, సామాజికవర్గాలను కించపరిస్తే ఇంతకు ముందులా ఊరుకునేది లేదు.
- ఇక నుంచి సినిమాల్లో మా సంస్కృతిని కించపరచడం చూస్తే మాత్రం ఎంతటివారైనా సహించేది లేదు.
- సీమలో 52కి 52 గెలుస్తాం...రాష్ట్రంలో 175కి 175 గెలుస్తామని శ్రీకాంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.