సీమకు ద్రోహం చేసిన మీరు.. మిషన్లు పెడతారా..!?

అన్నమయ్య జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

కుప్పానికి నీళ్లివ్వలేని బాబు.. రాయలసీమకు ఏం మేలు చేస్తాడు ..?

బాబు చేసిన ద్రోహన్ని సీమ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

సీమ ప్రాజెక్టులను అడ్డుకుంది మీరు కాదా..?

మీరు అధికారంలో ఉన్నప్పుడు సీమకు ఏం చేశారో చెప్పండి.

తండ్రీకొడుకులిద్దరూ ముక్కు నేలకు రాసి సీమ వాసులకు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సీమవాసులంతా ఫ్యాక్షనిస్టులు, రౌడీలని కించపరిచింది మీరు కదా?

మా మనోభావాలను దెబ్బతీసి ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారు..?

ఇకపై ఎవరైనా సరే..ఫ్యాక్షన్‌ సీమ అంటూ కించపరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయ‌స్ఆర్ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి

పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తుంటే ధర్నాలు చేయించిన వ్యక్తి చంద్రబాబు

వైయ‌స్ జగన్‌ గారి హయాంలోనే చిత్రావతి, గండికోటలో నీళ్లు.

కర్నూలులో హైకోర్టు పెడతామంటే స్టే తెచ్చింది మీరు కాదా..?

లోకేశ్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే

మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..?: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

అన్న‌మ‌య్య జిల్లా: కుప్పానికి నీళ్లివ్వలేని చంద్ర‌బాబు రాయలసీమకు ఏం చేస్తార‌ని,  సీమకు ద్రోహం చేసిన మీరు.. మిషన్లు పెడతారా..!? అని అన్నమయ్య జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని లోకేష్‌..చంద్ర‌బాబు ఏం చేస్తారయ్యా..? , ఈప్రాంతానికి మీరు చేసిన పాపానికి పచ్చాత్పాపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లోకేశ్‌ మా పరిగణలోనే లేడు..మా నినాదం 175కు 175 సీట్లు అని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

మిడిమిడి జ్ఞానంతో లోకేశ్‌..:
- లోకేశ్‌ మిడిమిడి జ్ఞానంతో, వ్యక్తిగత దూషణలతో, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా పాదయాత్ర చేస్తున్నాడు. 
- పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మమేకం అవ్వడం. 
- కానీ సాయంత్రం 4 గంటల వరకూ టెంటులోనే ఉంటున్నాడు. రోజుకి 19 గంటలు ఆయన టెంటులోనే గడుపుతున్నాడు. 
- ఒక అరగంట నడిచి...తరలించిన జనాలతో ఒక మీటింగులో పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతున్నాడు. 
- కేవలం ఆరోపణలు, దూషణలకే పరిమితమై వెళ్తున్నాడు. 
- కడపలో రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ ఏదో చేస్తానని మాట్లాడాడు. 
- 1995లో మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు...27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారు..? 
- మేం ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు ఇది చేశాం అని చెప్పుకోలేకపోతున్నారు. 
- ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేసేస్తారట...
- అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గురించి ఆలోచించకుండా, సీమవాసులంతా ఫ్యాక్షనిస్టులని, రౌడీలని దిగజారుస్తూ మాట్లాడారు. 
- రాయలసీమ వ్యక్తుల మనోభావాలను కించపరిచిన మీరు ఈ రోజు సీమలో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో సమాధానం ఇవ్వాలి. 

వైయ‌స్ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే సీమ అభివృద్ధి:
- రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే వైయ‌స్ఆర్‌కు ముందు..వైయ‌స్ఆర్‌ తర్వాత అనేది మాట్లాడుకోవాలి. 
- వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాయలసీమలో పురోగతి కనిపించింది. 
- తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు. 
- హంద్రీనీవా, గాలేరు నగరిని 80 శాతం పూర్తి చేసిన వ్యక్తి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారు. 
- చంద్రబాబు అధికారంలో ఉండగా హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను సాగునీటి ప్రాజెక్టులుగా వద్దని, తాగునీటి ప్రాజెక్టులు మార్చాలని జీవోలు ఇచ్చాడు. 
- 2004లో ముఖ్యమంత్రిగా వైయ‌స్ఆర్‌ బాధ్యత చేపట్టిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసి సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి 80 శాతం పూర్తి చేశాడు. 
- ఆ తర్వాత నువ్వు నడిపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కానీ, నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పూర్తి చేయలేదు. 
- వైయ‌స్ జగన్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాకనే గండికోట, చిత్రావతిలో పూర్తిగా నీళ్లు నిలబెట్టుకుంటున్నామంటే అది జగన్‌ గారి ఘనత. 
- రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కేవలం వైయ‌స్‌ కుటుంబానికి మాత్రమే ఉంది. 
- లోకేశ్‌ తాను చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాడు...ఆయన్ని ఒక జోకర్‌గా ప్రజలు భావిస్తున్నారు. 
- అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టుకు రూపకల్పన చేయలేని వ్యక్తి ఇప్పుడొచ్చి ఏదో చేస్తాడంటే నమ్మేది లేదు. 

కర్నూలు హైకోర్టుకు అడ్డుపడింది మీరు కాదా..?:
- పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సీమలో జిల్లాలు పెంచారు. కర్నూలులో మేం హైకోర్టు పెడతామంటే మీరే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్నారు...
- ఇప్పుడు అక్కడ హైకోర్టు బెంచ్‌ పెడతామని అవమానం చేస్తున్నావు..
- అంటే కర్నూలులో హైకోర్టును తిరస్కరిస్తున్నట్లు ఒప్పుకుంటున్నారు. 
- ఈయన అధికారంలోకి వస్తే స్పోర్ట్స్‌ హబ్‌ చేస్తాడట...వైయ‌స్ఆర్‌ గారు ఎప్పుడో ఇక్కడ స్పోర్ట్స్‌ స్కూల్‌ పెడితే..జగన్‌ గారు దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. 
- అనేకమైన ఆస్పత్రులు సీమకు తీసుకొచ్చింది వైయ‌స్‌ కుటుంబమే. 
- కేవలం విమర్శలతో కాలం వెళ్లబుచ్చాలని మీరు చూస్తున్నారు. 
- 1994 నుంచే హంద్రీనీవా, గాలేరునగరి చేసి ఉంటే బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ద్వారా సీమకు నీటి కేటాయింపులు కూడా వచ్చి ఉండేవి. 
- మీరు రాయల సీమ ద్రోహులు కాదా..? 
- సీమ గుండె చప్పుడు లాంటి పోతిరెడ్డిపాడును మహనీయుడు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారు యుద్ధప్రాతిపదికన రెండేళ్లలో పూర్తి చేశారు. 
- రాయలసీమ వాసులు చిరస్మరణీయంగా దీన్ని గుర్తు పెట్టుకుంటారు. 
- ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమ బాగుపడుతుందనే దుర్భుద్ధితో కృష్ణా బ్యారేజీపై నీ ఎమ్మెల్యేలతో దర్నా చేయించింది నువ్వు కాదా..? 
- వైయ‌స్ జగన్‌ గారు సీమకు మంచి చేయాలని పోతిరెడ్డిపాడు విస్తరణ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నిస్తే సిగ్గు లేకుండా ఈ వ్యక్తి ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో సీమకు నీళ్లు తరలించుకుపోతున్నారని లేఖలు రాయించారు. 

కుప్పానికి నీళ్లివ్వలేని నువ్వు రాయలసీమకు ఏం చేస్తావ్‌..?:
- కేవలం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌గా నడుపుతూ కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. 
- నీ మాటలు, నీ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు లోకేశ్‌.
- అలాంటి లోకేశ్‌ నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. 
- కుప్పంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కానీ ఇప్పటి వరకూ లేదు. 
- కుప్పానికి నీళ్లివ్వలేని నువ్వు రాయలసీమకు ఏం చేస్తావ్‌..? 
- ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నువ్వు నీ తండ్రి ఏం చేస్తారయ్యా..? 
- 3 సార్లు రాయలసీమ వాసులు నీకు అవకాశం ఇస్తే వారి మనోభావాలను దెబ్బ తీసిన వ్యక్తులు మీరు. 
- ఈ రోజు మీరొచ్చి ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరు
- వైయ‌స్‌ జగన్‌గారు వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ, రెవిన్యూ డివిజన్‌ చేశారు. 
- ఇక నువ్వు రాయలసీమకు ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారు..?
- ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ కూడా పూర్తిచేయలేకపోతే జగన్‌ గారు పూర్తి చేశారు. 
- తాత్కాలిక భవనాలని రాజధాని లేకుండా చేసింది నువ్వే. 
- వైజాగ్‌ను అభివృద్ధి చేద్దామంటే ప్రతి రోజూ స్టేలు తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుది.  
- విశాఖ అభివృద్ధి చెందకూడదు...అమరావతిలో ఏమీ జరగకూడదు..కర్నూలుకు హైకోర్టు రాకూడదు..ఇదే బాబు ఆలోచన. 
- మేనిఫెస్టోలో ఏమి చెప్పాడో దాన్ని శిరసావహిస్తూ 99 శాతం పూర్తి చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌గారు. 
- పీఆర్సీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ చేసిన జగన్‌ గారిని అభినందించాలి. 

లోకేశ్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే:
- ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్లు మిడిమిడి జ్ఞానంతో ఏదో సాధిస్తున్నాను అనుకంటే పొరపాటు. 
- కడప నగరం, వైయ‌స్ఆర్‌ జిల్లాలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. 
- నువ్వు అవకాశం ఉన్నపుడు ఏమీ చేయకుండా ఇవాళ డిక్లరేషన్‌ అంటున్నాడు. 
- సామాజిక వర్గ మీటింగులు పెట్టుకుని రెచ్చగొడుతున్నావు..
- ఏ ఆర్హతతో నువ్వు మాట్లాడుతున్నావ్‌ లోకేశ్‌..? ఏ అంశంపైనా నీకు మాట్లాడే అర్హత లేదు..
- కొప్పర్తి ఇండస్ట్రియల్‌గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి జగన్‌ గారు.
- లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా అక్కడ చర్యలు చేపట్టారు. 
- ఆనాడు స్టీల్‌ ప్లాంటు పెడుతుంటే నెమళ్లు నాట్యం అంటూ అడ్డుకున్నావ్‌.
- వైయ‌స్ జగన్‌గారు జింధాల్‌ తో మాట్లాడి మళ్లీ ఇప్పుడు దాన్ని ఒక రూపునకు తీసుకొస్తున్నారు. 

మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..?:
- దాన్ని పాదయాత్ర అంటారా..? కేవలం అది ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌.
- ఈ ప్రాంతం మీ వల్ల ఎంత నష్టపోయింది అనేది మీరు ఆలోచన చేస్తూ పాదయాత్ర చేయాలి.
- మీ 15 ఏళ్ల పరిపాలనలో సీమ ప్రజలకు మీరు చేసిన అన్యాయానికి  క్షమాపణలు చెప్పుకుంటూ తిరగాలి. 
- ఇచ్చిన మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..? 
- ఆయన చేసిన మొదటి సంతకాలు ఏమయ్యాయి..? 
- ఇప్పుడు మళ్లీ ఆల్‌ ఫ్రీ బాబులా హమీలిస్తున్నాడు. 
- వైయ‌స్ జగన్‌ గారు ఇస్తున్న స్కీమ్‌ల పేరు మార్చి హామీలిస్తే సరిపోదు. 
- ఈ బాధ్యత లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో ఆలోచించండి. 
- సిగ్గు లేకుండా పిల్లల్ని పుట్టించుకోండి..ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానంటాడు. 
- గతంలో ఇదే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే వెనిజులా, శ్రీలంక అయిపోతుంది అన్నాడు. 
- ఇప్పుడు అవే హామీలిచ్చి ఎల్లో మీడియాతో భజన చేయించుకుంటున్నాడు.
- వైయ‌స్ జగన్‌ గారు మీకు మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అంటున్నారు. 
- ఈ మాట చంద్రబాబు చెప్పగలడా..?

తండ్రీ కొడుకులది డ్రామా పాదయాత్ర:
- అన్ని రంగాల్లో రాయలసీమను మోసం చేసి, సామాజిక వర్గాలను కించపరిచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 
- పాదయాత్ర అంటే వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జగన్‌ గారిని చూసి నేర్చుకో లోకేశ్‌.
- నీ తండ్రిలా అప్పటికప్పుడు మట్టిరోడ్లు వేయించి రాత్రి పూట నడవడం కాదు. 
- తండ్రీ కొడుకులది డ్రామా పాదయాత్ర. 
- లోకేశ్‌ పాదయాత్ర రెండు రోజుల్లో రాయలసీమను వీడనుంది. 
- మీరు చేసిన తప్పునకు ఈ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలి. 
- సీమ వాసులను ఫ్యాక్షనిస్టులు అన్నాం..క్షమించండి అని కోరండి. 
- పోతిరెడ్డిపాడును ఆనాడు వ్యతిరేకించాం...సీమ ప్రజలు క్షమించండి అని చెప్పి వెళ్లు. 
- నేను పదేళ్లలో చేయకపోవడం వల్లే సీమకు నీటి కేటాయింపులు రాలేదని క్షమాపణ చెప్పి వెళ్లాడు. 
- కర్నూలు ఎయిర్‌ పోర్టు అని శంకుస్థాపన చేసి ఏదో చేసినట్లు చెప్పుకుంటున్నారు. 
- దానికి రూ. 280 కోట్లలో రూ. 180 కోట్లు జగన్‌ గారే విడుదల చేసి ముందుకు సాగించారు. 
- ఓర్వకల్లులో నిర్మిస్తున్న పారిశ్రామికవాడ, కొప్పర్తి సెజ్, శ్రీ సిటీల్లో మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో...మా హయాంలో ఎన్ని వచ్చాయో చూసుకో. 
- నీ ముక్కు నేలకు రాసి...రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 
- చంద్రబాబు కూడా సీమకు వచ్చి కొడుకుతో పాటు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. 

సామాజికవర్గాల ప్రస్థావన చంద్రబాబుతోనే ప్రారంభం:
- గత నాలుగేళ్లలో రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడారు. 
- అధికారంలో ఉన్నపుడు పత్తికొండ నారాయణరెడ్డిని, రాప్తాడు ఎమ్మార్వో ఆఫీసులో రెడ్డి సామాజిక వర్గ వారిని హత్యలు చేయించింది వీళ్లు కాదా..? 
- వందల మంది రెడ్డి సామాజికవర్గీయులను హత్యలు చేసిన వీళ్లు ఇప్పుడు రెడ్లపై ప్రేమ ఒలకబోస్తే ఎట్లబ్బా..? 
- సామాజిక వర్గాల గురించి మాట్లాడే పరిస్థితి చంద్రబాబుతోనే ప్రారంభం అయ్యింది. 
- మేం ప్రతి సామాజికవర్గాన్నీ సమానంగా చూస్తున్నాం. అన్ని వర్గాలకూ మేం సంక్షేమాన్ని అందిస్తున్నాం. 
- అన్ని వర్గాలకు శ్యాచురేషన్‌ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్నాం. 
- అన్ని కులాలను సమానంగా చూసేవాడు రాజకీయ నాయకుడు. 
- కుట్రపూరితంగా అధికారంలోకి రావాలని సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. 
- అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడిపించే వాడు అసలైన నాయకుడు. 
- సినిమాల్లో వాళ్లకి తెలిసిన వారితో దొంగలు, దోపిడీదారులుగా చిత్రీకరించింది మీరే కాదా..? 

సీమను కించపరిచి మళ్లీ డిక్లరేషనా..?:
- చేసిన తప్పునకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాం. కానీ ఆయనేదో పరిణితి చెందాడని, ఆయనకు భయపడి కాదు. 
- ఈప్రాంతానికి చేసిన పాపానికి పచ్చాత్పాపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. 
- లోకేశ్‌ మా పరిగణలోనే లేడు..మా నినాదం 175 సీట్లే. 
- చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్‌ ఉంది. రాజశేఖరరెడ్డిగారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్‌ వద్దు..ఫ్యాషన్‌ ముద్దు అంటూ నిర్మూలించారు. 
- పరిటాల రవి హాయాంలో వేలమందిని మాయం చేసేశారు. ఎక్కడ చూసిన బాంబులు వేయించింది మీ చరిత్ర. 
- ఫ్యాక్షన్‌ రూపుమాపింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారే. 
- అక్కడెక్కడో ట్రైన్‌ కాలిపోతే రాయలసీమ గూండాలు అన్నది మీరు కాదా..? 
- ఈ రోజు మీకు సీమ డిక్లరేషన్‌ చేసే అర్హత ఉందా..? 
- భవిష్యత్తులో ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా సినిమాల్లోనైనా, ఎక్కడైనా సరే సీమ సంస్కృతి, సామాజికవర్గాలను కించపరిస్తే ఇంతకు ముందులా ఊరుకునేది లేదు. 
- ఇక నుంచి సినిమాల్లో మా సంస్కృతిని కించపరచడం చూస్తే మాత్రం ఎంతటివారైనా సహించేది లేదు. 
- సీమలో 52కి 52 గెలుస్తాం...రాష్ట్రంలో 175కి 175 గెలుస్తామ‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top