బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
ధాన్యం అమ్మిన 15 రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు
13 Jan 2021 1:03 PM
సీఎం వైయస్ జగన్ దృష్టికి ధాన్యం కొనుగోళ్ల సమస్యను తీసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: ధాన్యం విక్రయించిన 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య తీవ్రతను ఫోన్ లో సీఎం వైయస్ జగన్ దృష్టికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తీసుకెళ్లారు. ధాన్యం అమ్మి 20 రోజులు గడిచిన రైతుల అకౌంట్ లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ధర్మాన సీఎం వైయస్ జగన్కు వివరించడంతో ముఖ్యమంత్రి స్పందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లో తప్పనిసరిగా చెల్లింపు జరగాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ధర్మాన హర్షం వ్యక్తం చేస్తూ.. రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.