కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పవన్తో కలిసి బీజేపీ విలువలు కోల్పోయింది
05 Jan 2021 1:04 PM
రాజకీయ లబ్ధికి దేవుళ్లను వాడుకుంటే సహించం
ప్రతిపక్షాలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజం
విజయవాడ: ప్రతిపక్షాలు వారి రాజకీయ స్వార్థానికి రామతీర్థం ఘటనను వాడుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం దేవుళ్లను వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పార్టీలు కూడా ఛాలెంజ్లు విసరడం హాస్యాస్పదమన్నారు. పవన్ కల్యాణ్తో కలిసిన తర్వాత బీజేపీ విలువలు మొత్తం కోల్పోయిందన్నారు. రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీఐటీ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు.