కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు
11 Jun 2022 1:09 PM
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం, శెట్టూరు మండలం, రంగయ్యపాలెం గ్రామంలో `గడప గడపకూ మన ప్రభుత్వం` కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి వైయస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి వివరించారు. మూడేళ్ల పాలనలో సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని వివరించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని వివరిస్తూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.