పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
టీడీపీ అక్రమాలపై విచారణ చేయిస్తాం
09 Nov 2019 3:06 PM
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
అనంతపురం జిల్లా: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అవినీతి సహించేది లేదని, అవినీతి జరిగితే సంబంధిత ఐసీడీఎస్ పీడీలదే బాధ్యత అని సంబంధిత శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పథకాలపై మంత్రి తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పేదలకు అందాల్సిన నిధులు పక్కదారి పట్టాయని, అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. మహిళల సంక్షేమమే సీఎం వైయస్ జగన్ సర్కారు ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. అధికారులు నిబద్ధతో పనిచేయాలని సూచించారు.