చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి
20 Dec 2021 1:36 PM
మంత్రి శ్రీరంగనాథరాజు
పశ్చిమగోదావరి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. 4 లక్షల కోట్ల ఆస్తిని పేదలకు సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. ఓటీఎస్పై కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 4 వేల కోట్లు లబ్ధిదారులు చెల్లించడం ద్వారా పేదలకు 10 వేల కోట్ల రుణ మాఫీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రుణ భారంలో ఉన్న పేద వారికి రుణ విముక్తి కలిగించి ఓటీఎస్తో వారి ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నారన్నారు. రుణం లేనివారి దగ్గర 10 రూపాయల నామమాత్రపు రుసుంతో రిజిస్ట్రేషన్ పట్టా అందిస్తున్నామని’’ శ్రీరంగనాథరాజు అన్నారు.