చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. వయసు 73. అనుభవం 45. సీఎంగా 14. కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే స్కీము లేదు! వాటే పిటీ బాబూ...? అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు శ్రీ బాలా త్రిపురాంతకేశ్వరుడు మరియు త్రిపుర సుందరి దేవి అమ్మవారినీ దర్శించుకోవడం జరిగింది. శరన్నవరాత్రులు పురస్కరించుకొని మొదటిరోజు త్రిపురాంతకేశ్వరుడికి మరియు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందంటూ మంత్రి రోజా మరో ట్వీట్ చేశారు.