దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో చంద్రబాబు ఆద్యుడు

మంత్రి కొడాలి నాని

విజ‌య‌వాడ‌: దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో చంద్రబాబు ఆద్యుడని మంత్రి కొడాలి నాని మండిప‌డ్డారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ‘నవరత్నాలు-పేదలకు ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. 2631 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తే.. పునాదులు కదులుతాయని  ప్రతిపక్షాలు కుట్రపన్నాయని దుయ్యబట్టారు. 25 కోట్లు ఖర్చు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్లను పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు.  

Back to Top