లోకేష్‌ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోతుంది

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు: లోకేష్‌ చేయబోయే పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. లోకేష్‌ను టీడీపీ నేతలు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, అతనికి అంతసీన్‌ లేదన్నారు. ఆ పాదయాత్రతో ఇరిగేదేమీ ఉండదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విప్పనిగళం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విప్పితే ఏం లాభమని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీలు అధికారంలో ఉండ‌గా ఎందుకు అమలు చేయలేదని పాదయాత్రలో ప్రజలు ప్రశ్నిస్తే లోకేష్‌ ఏం సమాధానం చెబుతారన్నారు.

Back to Top