ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్ర‌భుత్వం చేయూత‌

ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఉప‌క‌ర‌ణాలు పంపిణీ చేసిన‌ మంత్రి కాకాణి  

నెల్లూరు:  ప్ర‌త్యేక అవ‌స‌రాలు క‌లిగిన పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా చేయూత‌నందిస్తున్న‌ట్లు మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న భవితా కేంద్రాలలో గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపకరణాలను  ఉచితంగా పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి ఇలాంటి అత్యున్నత కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్న చిన్న లోపాలతో పుట్టిన పిల్లలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందనిన్నారు. వారు కూడా సమాజంలో సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించేందుకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.

 ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు, శాస్త్ర చికిత్సలతో పాటు ఉచితంగా ఉపకరణాలను అందిస్తున్నామన్నారు. మొత్తం ఆరు విభాగాలకు సంబంధించి 394 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఆరు రకాల ఉపకరణాలను మంత్రి కాకాని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం ఆరుణమ్మ, జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మానాధ్, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జడ్పీ సీఈఓ చిరంజీవి సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సిహెచ్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top