విశాఖ గర్జనను డైవర్ట్‌ చేయడమే లక్ష్యం

ఈ దాడులు ఉద్దేశపూర్వకమే

శిఖండిలా పవన్‌కళ్యాణ్‌

మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడి

మా పార్టీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

అందుకు పవన్‌కళ్యాణ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి

ఉత్తరాంధ్ర ప్రజలనూ పవన్‌ క్షమాపణలు కోరాలి

మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌

ఇక్కడి ఉద్యమానికి తూట్లు పొడవడమే పవన్‌ లక్ష్యం

అందుకే ఇవాళ్టి నుంచి ఇక్కడ పర్యటన పెట్టుకున్నారు

కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆయన వచ్చాకే దాడులు

ఉత్తరాంధ్ర ప్రాంతంపై పవన్‌కళ్యాణ్‌ కక్ష కట్టారు

తనను ఓడించినందుకు పవన్‌ ఇలా చేస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో మంత్రి  అమర్‌నాథ్‌ స్పష్టీకరణ 

విశాఖపట్నం: విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోసం జేఏసీ ఆ«ధ్వర్యంలో భారీగా గర్జన ర్యాలీ జరిగింది. భారీ వర్షం కురుస్తున్నా అందరూ ఉత్సాహంగా అందులో పాల్గొన్నార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. గర్జనను డైవర్ట్‌ చేయడమే పవన్‌కళ్యాణ్‌ లక్ష్యం. అందుకే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు చేశారు. పవన్‌కళ్యాణ్‌ ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

చెవుల్లో పూలు..:
    ఉత్తరాం«ధ్ర ప్రాంత నాయకులతో సమావేశం. జనవాణి పేరుతో పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడ పర్యటన మొదలు పెట్టారు. ఇక్కడి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారా? అసలు మీకు ఈ ప్రాంతంపై మమకారం ఉందా? అది లేకపోయినా ఉన్నట్లు చూపుతున్నారు. నిజానికి మిమ్మల్ని ఇక్కడ ఓడించినందుకు మీరు ఈ ప్రాంతంపై కక్ష కట్టారు. అందుకే ఈ ప్రాంతం మీద మీరు విద్వేషాలు చూపుతున్నారు. ఇక్కడ వెనకబడిన ప్రాంతం గురించి పట్టించుకోకుండా, రాజకీయ ప్రయోజనం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు.

నాయకుడికి క్యారెక్టర్‌ ఉంటే..:
    ఈ సైకో పనులు ఏమిటి? మంత్రులు, నాయకుల మీద దాడి ఏమిటి? వైయస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తల్చుకుంటే మీరు కనీసం ఒక్క నిమిషం అయినా ఉండగలరా? మా ఫ్లెక్సీలు చింపడం ఏమిటి? ఏ మాత్రం క్యారెక్టర్‌ లేని వాళ్లు. అసలు
నాయకుడికి క్యారెక్టర్‌ ఉంటే కదా? అది ఉంటే కార్యకర్తలు కూడా పద్ధతిగా ఉంటారు. మీ పార్టీకి ఒక సిద్ధాంతం, లక్ష్యం లేదు. ఏమీ లేకుండా పార్టీని నడిపితే ఇలాగే ఉంటాయి.

క్షమాపణలు చెప్పాలి:
    ఇవాళ్టి దాడిని తీవ్రంగా «ఖండిస్తున్నాం. అందుకే దీనిపై వెంటనే పవన్‌కళ్యాణ్‌ స్పందించాలి. మా పార్టీకి, నాయకులను క్షమాపణలు కోరాలి. ఇవాళ ఈ ఉద్యమానికి తూట్లు పొడవడానికి వచ్చిన పవన్, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా క్షమాపణ చెప్పాలి.

ఫ్రస్టేషన్‌లో పవన్‌:
    మీకు సిగ్గు లేదు. లక్ష్యాలు లేవు. ఒక ప్రాంతం మీద అభిమానం లేదు. ఎక్కడికి పోతే ఆ మాట మాట్లాడతావు. కర్నూలుకు పోతే, అక్కడే రాజధాని ఉండాలంటావు. అమరావతి వస్తే అక్కడే రాజధాని అంటావు.
విజయనగరం వెళ్తే, అక్కడే రాజధాని అంటావు. ఉండడానికి రాష్ట్రంలో ఇల్లు లేదు. పక్క రాష్ట్రంలో ఉంటావు.
    నీవు ప్రజల కోసం కాకపోయినా, నీ కోసం అయినా బ్రతకాలి కదా? ఇంట్లో గెలవలేని వాడివి.. రచ్చలో ఏం గెలుస్తావు? పెళ్లి అనేది ఒక సర్దుబాటు జీవితం. అందులో ఇమడలేని వాడివి ప్రజా జీవితంలో ఎలా నెగ్గుకురాగలవు? అందుకే ఆ ఫ్రస్టేషన్‌ అంతా చూపిస్తున్నావు. కార్యకర్తల మీద, ప్రజల మీద, ప్రాంతాల మీద చూపిస్తున్నావు. ప్రజల ఆకాంక్షలను తప్పుదోవ పట్టించి తద్వారా లబ్ధి పొందడం. చంద్రబాబు డబ్బులు ఇస్తారు. తీసుకుంటున్నావు. 

మూల్యం తప్పదు:
    నీకు నటన జీవితం ఇచ్చింది విశాఖపట్నం. నటన నేర్పింది విశాఖపట్నం. తొలుత నీకు పిల్లను ఇచ్చింది విశాఖపట్నం. చివరకు నీవు పోటీ చేసింది విశాఖలోనే. అయినా అన్నీ మర్చిపోయావు. ఉత్తరాంధ్రను వాడుకుని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూస్తున్నావు. ఉద్యమానికి తూట్లు పొడవాలని నీవు చేస్తున్న పనులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

పవన్‌ ఒక శిఖండి:
    మీ పార్టీకి, తెలుగుదేశంకు ఉత్తరాంధ్ర అవసరం లేదు. ఇక్కడి ప్రజలు అవసరం మీకు లేదు. అయినా ఎందుకొచ్చారు. ఇవాళ్టి దాడులపై చర్యలు తప్పవు. చట్టం తన పని తాను చేస్తుంది. ఉద్యమం మీద చేసిన దాడికి పవన్‌కళ్యాణ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి. పవన్‌ ఒక రాజకీయ శిఖండి.

ఆ ప్రకటన హాస్యాస్పదం:
    ఎవరు ఎవరి మీద దాడి చేశారు? మాపై వారు చేశారా? వారు మాపై దాడి చేశారా? ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటే, ఆయన ఎందుకు వచ్చినట్లు? కేవలం ఉద్యమానికి తూట్లు పొడిచే ప్రయత్నం కాదా? ఇవాళ మా పార్టీ నాయకులేమీ ప్రేరేపించలేదే? వారు విమానాశ్రయానికి వెళ్తుంటే రెచ్చిపోయి దాడి చేసింది ఎవరు? కేవలం పవన్‌కళ్యాణ్‌ వైఖరి వల్లనే ఇదంతా జరిగింది.
    తమ నేత పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దాడి చేశారంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పడం హాస్యాస్పదం. ఇక్కడ జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమం ప్రకటించిన తర్వాతే, పవన్‌ తన పర్యటన ప్రకటించారు. దీంతో ఆయన ఉద్దేశం ఏమిటన్నది అర్ధం అవుతోంది.

ఇది ఉద్యమంపై దాడి:
    ఇది మాపై మాత్రమే చేసిన దాడి కాదు. ఉద్యమంపై చేసిన దాడి. ఉదయం నుంచి చూశారు. ర్యాలీ ఎంత చక్కగా జరిగిందో? ఎంత మంది హాజరయ్యారో? పవన్‌కళ్యాణ్‌ వచ్చాకే ఈ దాడి జరిగింది. దీన్ని బట్టి ఆయన వైఖరి ఏమిటి అన్నది తెలుస్తోంది కదా?.. అని మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్‌ గుర్తు చేశారు.
 

Back to Top