అమరావతి: టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ..విద్యుత్ యూనిట్ రూ.2 దొరికే చోట రూ.4.83 పైసలకు కొనుగోలు చేశారని అన్నారు. ప్రజల సొమ్మును 42 మందికి ధారాదత్తం చేసేందుకు 45 రోజుల్లో హుటాహుటిన 42 అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి చర్యతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయలు భారం పడిందని అన్నారు. ఆ పరిస్థితుల్లో పవన విద్యుత్ గురించి రివ్యూ చేశామని, 45 రోజుల్లో ఎంటరైన 42 అగ్రిమెంట్లపై సమీక్షించామని తెలిపారు. సాధారణంగా విండ్ మిల్లు పెట్టాలంటే సంవత్సరం సమయం పడుతుందని, అయితే, 45 రోజుల్లోపే ఒప్పందం, 45 రోజుల్లోపే విద్యుత్ ఉత్పత్తి కూడా చేసినట్లు టీడీపీ ప్రభుత్వం పేర్కొందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి చేసిన వారికి యూనిట్కు 50 పైసలు ఇన్సెంటీవ్ ఇచ్చినట్లు చెప్పుకుందని, ఇవన్నీ లెక్క చూస్తే రూ.2 వేల కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చిందని బుగ్గన అన్నారు. ప్రజలు కట్టే పన్ను ఆదాయాన్ని ఇలా 42 మందికి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు యత్నించారని చెప్పారు. ఆయన చేసిన పని తప్పు అని చెప్పేందుకే తాము పవన విద్యుత్పై రివ్యూ చేశామని చెప్పారు.
ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు అప్పులు..
ప్రతి ఫైనాన్స్ కమిషన్ ఒక నిబంధన పెడుతుంది. 2015-2016లోనే చట్టాన్ని అమైండ్ చేయాల్సి ఉంది. ఇందులో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే..రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మాత్రమే అప్పు చేసే అవకాశం ఉంది. 3 శాతం కంటే కూడా అప్పు చేసే అవకాశం కూడా ఉంది. మన వడ్డీ మనకు ఉన్న రెవెన్యూ రశీదులు 10 శాతం ఉంటే అప్పు చేయవచ్చు. 14వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు అప్పులు చేయాల్సి ఉంటుంది. చట్టాన్ని అమైండ్ చేస్తూ అప్పు తీసుకునే పరిమితిని పెంచుకోవచ్చు.13వ ఆర్థిక సంఘం అమలులో ఉన్న సమయంలో 3.5 శాతానికి అనుమతించింది. 2008-2009లో 4 శాతానికి పెంచింది. 2011లో కూడా ఒకసారి అమైండ్మెంట్ చేయడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం పరిధిలోకి 2019-2020లో 1.88 శాతం ఉండాల్సింది 2.88 శాతానికి వచ్చింది. అప్పు, స్థూల ఉత్పత్తి 22.77 ఉండాల్సి ఉండగా మార్సుల ప్రకారం అమైండ్ ప్రకారం చేసుకోవాల్సి వస్తోంది. 2015-2019లో రెవెన్యూ లోటు 2.19 శాతానికి అనుమతించారు. దానికి అనుగుణంగా 2.4 శాతం నుంచి 4 శాతానికి మార్పు చేస్తున్నాం. కోవిడ్ కారణంగా ఈ సవరణలు చేయాల్సి వస్తోంది. 2 శాతానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దాంట్లో 0.5 శాతం అన్ కండిషనల్గా, 1 శాతం కొన్ని సంస్కరణల ద్వారా, మరో 0.5 శాతం సవరణ చేశామని మంత్రి బుగ్గన తెలిపారు.