వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సీపీఎస్పై సరైన నిర్ణయం తీసుకుంటాం
25 Apr 2022 12:01 PM
సీఎం ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదు
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీపీఎస్పై కమిటీ వేశామని, ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని, దీనిపై సమావేశం కూడా జరగనుందని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయని ప్రశ్నించారు.