వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అన్నదాత సుభిక్షంగా ఉండడమే ముఖ్యమంత్రి ధ్యేయం
15 Jun 2019 12:41 PM
వైయస్ఆర్ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తిచేస్తాం
ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అనిల్కుమార్యాదవ్
అమరావతి: అన్నదాత సుభిక్షంగా ఉండడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ధ్యేయమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్కుమార్ యాదవ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగుగంగ నుంచి 1.3 టీఎంసీ తాగునీరు అందించే ఫైల్పై మంత్రి అనిల్కుమార్ యాదవ్ తొలి సంతకం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. ఇకపై ఇరిగేషన్ శాఖ పారదర్శకంగా ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో రైతు సుభిక్షంగా ఉంటాడని వివరించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందని, మా పాలనలో దోపిడీ ఉండాదన్నారు. ప్రతి టెండర్ను జ్యుడీషియల్ కమిటీ ముందు ఉంచుతామన్నారు.