టీడీపీని కాపాడటం ఎవరి వల్ల కాదు

మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: అవినీతిలో కూరుకుపోయిన తెలుగు దేశం పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సర్వనాశకం అవ్వడానికి లోకేషే కారణమని,  పవన్‌కు ఏ బలం ఉందని టీడీపీకి మద్దతు ఇస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కక్షసాధింపు ఏంటిని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. ఈ నెల 26 నుంచి వైయస్‌ఆర్‌సీపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
 

 

Back to Top