డిగ్రీ కాలేజీలలో కూడా నాడు-నేడు

మంత్రి ఆదిమూలపు సురేష్
 

విజయవాడ: నాడు-నేడు కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి డిగ్రీ కాలేజీలలో కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఇంటర్మీడియట్‌ విద్యపై మానిటరింగ్‌ కోసం పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. అందరికి విద్య చేరువలో ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వివిధ రకాలైన మార్పులను తీసుకువస్తుందన్నారు. కాలేజీలు వ్యాపార ధోరణిలో వెళ్లకుండా ఉండాలని యాజమాన్యాలకు సూచించారు. జూనియర్‌ కాలేజీలలో కోచింగ్‌ సెంటర్స్‌ నడపడానికి వీలు లేదని స్పష్టం యాజమన్యాలకు స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కచ్చితంగా దృష్టి పెడతామని, ఇప్పటికే పలుమార్లు హెచ్చారించామని తెలిపారు. ఇక వచ్చే ఏడాది నుంచి విద్యలో కీలక నిర్ణయాలతో  ముందుకు వెళతామని మంత్రి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top