విశాఖ‌కు చెందిన ప‌లువురు నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌ 

తాడేప‌ల్లి: విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో విశాఖపట్ట‌ణానికి చెందిన జి.వి.రవిరాజు (సీనియర్‌ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు) వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ. సుబ్బారెడ్డి, గాజువాక వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ నార్త్ వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కే.కే. రాజు పాల్గొన్నారు. 

Back to Top