సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3000కు పెంపు

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కెబినెట్ నిర్ణయం

వైయ‌స్ఆర్‌ ఆసరా, వైయ‌స్ఆర్‌ చేయూత పథకాల అమలుకు ఆమోదం

ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ

విశాఖలో లైట్‌మెట్రో రేల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం

ఆడుదాం ఆంధ్రా బ్రాండ్‌ అంబాసిడర్ల నియామ‌కం

ఈ నెల 21న 8వ తరగతి విద్యార్థులకు  ట్యాబుల పంపిణీ

ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం

అమరావతి: జనవరి నుంచి వైయ‌స్ఆర్‌ సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3000కు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తం 45 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మిచౌంగ్ తుఫాన్ నష్ట పరిహారం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైయ‌స్ఆర్‌ ఆసరా, వైయ‌స్ఆర్‌ చేయూత పథకాల అమలుకు ఆమోదం లభించింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభం కానున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది.  కేబినెట్‌ భేటీలో తీసుకున్న‌ కీలక నిర్ణయాల‌ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మీడియాకు వెల్ల‌డించారు.  

కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు :

  • సామాజిక పెన్షన్‌లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపునకు కేబినెట్‌ ఆమోదం
  • ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కెబినెట్ నిర్ణయం
  • 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు
  • ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ
  • విశాఖలో లైట్‌మెట్రో రేల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం
  • వైయ‌స్ఆర్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగామన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశం
  • ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టాం
  • ఆరోగ్యశ్రీ అవగాహన.. ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణ ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేస్తాం.
  • వైద్యారోగ్య రంగంలో వివిధ స్ఖాయిల్లో పోస్టుల భర్తికీ కెబినెట్ ఆమోదం
  • ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం.
  • శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స
  • జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్‌ ఆమోదం
  • కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం
  • కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు గ్రామ సచివాలయంలో పొందవచ్చు
  • 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ
  • కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్‌ చెల్లింపు
  • యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15శాతం అలవెన్స్‌ పెంపు
  • 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్‌
  • ఆడుదాం ఆంధ్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంబటి రాయుడు
  • కేబినెట్‌ సబ్‌కమిటీ, స్టీరింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ఆమోదం
  • పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఈ నెల 21న సీఎం వైయ‌స్ జగన్ పుట్టినరోజు సందర్భంగా  8వ తరగతి విద్యార్థులకు  ట్యాబుల పంపిణీ
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  టూల్ కూడా పంపిణీ  జరుగుతుంది.
  • జనవరి 10 నుంచి 23  వరకు మహిళలకు  ఆసరా  నాలుగో విడత  కార్యక్రమానికి కేబినెట్  ఆమోదం.
  • జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం ఉంటుంది.
  • 45 నుంచి 60 ఏళ్లలోపు  ఉన్న మహిళలకు ఆర్ధిక  సహాయం చేయడానికి  కేబినెట్ ఆమోదం  
  • ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం
  • ఇకపై ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కెబినెట్ నిర్ణయం
Back to Top