మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మైనారిటీ నేత సాధిక్ అలీ వైయస్ఆర్సీపీలో చేరిక
06 Mar 2019 4:29 PM
వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత
వైయస్ఆర్ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాక్లిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వైయస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైయస్ఆర్సీపీలో చేరగా తాజాగా కడప నగర టీడీపీ అధ్యక్షుడు సాధిక్ అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత వైయస్ జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ముఖ్య అనుచరులు, టీడీపీ సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడారు. వేంపల్లి మెదటి వార్డు మెంబర్ కొరివి రామ సుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైయస్ఆర్సీపీలో చేరారు. సతీష్ అనుచరులు జేరిపిటి సుధాకర్తో సహా 30 కుటుంబాలు టీడీపీని వీడారు. వైయస్ఆర్సీపీ మాజీఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.