బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దు
06 Sep 2022 5:39 PM
అస్వస్థతకు గురైన విద్యార్థులకు కాకినాడ జీజీహెచ్లో చికిత్స
విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత
కాకినాడ: అస్వస్థతకు గురై కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించారన్నారు. ఉదయం నుంచి కొంతమంది విష వాయువు అంటూ రూమర్స్ ప్రచారం చేస్తున్నారని, అదంతా తప్పుడు ప్రచారమని తేలిందన్నారు. 419 మంది విద్యార్థులున్న పాఠశాలలో కేవలం రెండు తరగతుల్లో 18 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. విష వాయువులు కాదు.. కారణం ఏంటనేది కమిటీ నిర్ధారిస్తుందన్నారు.
దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు
పొల్యూషన్ కంటే తప్పుడు ప్రచారాలు ప్రమాదకరంగా అని వైయస్ఆర్ సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ జీజీహెచ్లో విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలకు ఏమైనా అయ్యిందంటే తల్లిదండ్రులకు ఆందోళన కలుగుతుందని, విద్యార్థులు అస్వస్థకు గురైతే.. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. పిల్లల్లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదని, కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత కారణాలు బయటకు వస్తాయన్నారు.