క‌ర్నూలులో వైయస్సార్ ఉచిత పంటల బీమా పంపిణీ

క‌ర్నూలు: ఏరువాక సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నకు అండగా 2021- ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ 2,977.82 కోట్ల భీమా ఈ పరిహారాన్ని ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి లో రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి నేరుగా జమ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారు అందులో భాగంగా కర్నూల్ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో  కర్నూలు జిల్లా రైతన్నలకు దాదాపుగా రూ. 339.61  కోట్ల రూపాయల భీమా పరిహారం చెక్ ను  రైతులకు అందజేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ కోటేశ్వర రావు, పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ , కోడుమూరు శాసనసభ్యులు జరదొద్ది సుధాకర్  ,జిల్లా పరిషత్ చైర్మన్ పాపి రెడ్డి  ,కర్నూల్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, అధికారులు పాల్గొన్నారు

Back to Top