శ్రీకాకుళం: ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామని ఉద్ఘాటించారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందని తెలిపారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టుంది. జట్టుకట్టి… ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు. సోమవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై మంత్రి ధర్మాన స్పందించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏమన్నారంటే.. దేశవ్యాప్తంగా ఆ దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం: న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే ఆలోచన: అంతవరకూ యాక్ట్ను అమలు చేయమని గతంలోనే స్పష్టంచేశాం: ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు: ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం: సమగ్ర సర్వేద్వారా ఎంతో మేలు చేకూరుతోంది: అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించాం: దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయి: పరిపాలన వికేంద్రకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు : గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయి: మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది, ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుంది: ఇంత చేస్తుంటే.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారురు: చేతకాని దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారాలు ఇవి: రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు: జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెప్తుంది: 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్కాదా? అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా?: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా?: చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్… మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా?: రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా?: మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా?: మీ చేతిలో ఉన్నవి ఎల్లోమీడియా మాత్రమే? కాని ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయి: నిజాలను వారే అందరికీ వివరిస్తారు: ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు తీసుకునే భావజాలం టీడీపీది: భూములను నిరుపేదలకు పంచాలన్న భావజాలం జగన్ది: చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: ఏ వేదికపైనైనా వచ్చి చర్చకు నేను సిద్ధం: రైతులకు అనుకూల నిర్ణయలు తప్ప, ఒక్క వ్యతిరేక నిర్ణయాన్నీ తీసుకోలేదు: దొంగరాతలు, తప్పుడు ప్రచారాలు మానండి: