మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రేపు విజయవాడలో సీఎం వైయస్ జగన్ పర్యటన
03 Dec 2022 5:25 PM
తాడేపల్లి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు (04-12-2022) విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. అనంతరం రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన వివరాలు..
ఉదయం 10.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు. అనంతరం 11.25 – 12.15 గంటల మధ్య పోరంకి మురళీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 12.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్భవన్కు బయలుదేరి 1.00 – 2.15 గంటలకు రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్భవన్లో గవర్నర్ ఏర్పాటుచేసిన అధికారిక విందులో పాల్గొంటారు. అనంతరం 2.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి వీడ్కోలు పలికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.