హైదరాబాద్ : దివంగత దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడుతూ... వైయస్ఆర్ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని చెప్పారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా...అని తెలిపారు. కాగా ఇప్పటికే ప్రముఖ హాస్యనటుడు అలీ, జయసుధా, రాజారవీంద్ర, కృష్ణుడు తదితరులు వైయస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే.