సీపీఎం నేత మధుకు సీఎం పరామర్శ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధును పరామర్శించారు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మధు గత కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీఎం వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని మధు స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి ఉన్నారు.

Read Also: చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు

Back to Top