ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
కోవిడ్ టెస్ట్ల సంఖ్య ఐదు వేలకు పెంపు
27 Jul 2020 6:04 PM
హోమ్ ఐసొలేషన్ ద్వారా వైద్యం అం
మంత్రి అవంతి శ్రీనివాసరావు
విశాఖపట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో కోవిడ్ టెస్టుల సంఖ్య 3 వేల నుంచి 5 వేలకు పెంచినట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విశాఖలో కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసింది. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ పేషేంట్లకు హోమ్ ఐసొలేషన్ ద్వారా వైద్యం అందించాలని భావిస్తున్నామని తెలిపారు. ఐసీఎంఆర్ అనుమతితో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి ఇస్తాము. అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నాము. మానవతా థృక్పథంతో ఉన్న వైద్యసిబ్బంది కోవిడ్ సేవలు అందించడానికి ముందుకు రావాలని కోరారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వైద్యవిభాగంలో లోపాలు ఉన్నాయి. వాటిన్నిటినీ సరిదిద్దుకుంటూ ప్రజలకు కోవిడ్పై అవగాహన కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను మెడికల్ ఆక్సిజన్గా మారుస్తున్నాము. జిల్లాలో అదనంగా మొత్తం 22 ఆస్సత్రులు కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించామని, ఇప్పటికే 4వేల బెడ్స్ ఉన్నాయి. వీటిని 7వేల వరకు పెంచనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు