మార్చి నెలాఖరు కల్లా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి

 
సమీక్ష‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప‌నుల పురోగ‌తిని వివ‌రించిన అధికారులు

విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు 

ప్రాంగణంలో దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్  

ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం

తాడేప‌ల్లి: విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఏర్పాట‌వుతున్న‌డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణ ప‌నులు మార్చి నెలాఖ‌రు క‌ల్లా పూర్తి అవుతాయ‌ని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వివ‌రించారు. విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

స‌మీక్ష ముఖ్యాంశాలు :

  • విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.
  •  విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుందని తెలిపిన అధికారులు.
  •  అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లు.
  •  పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందని తెలిపిన అధికారులు.
  •  ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని తెలిపిన అధికారులు.
  •  విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామన్న అధికారులు.
  •  మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్న అధికారులు.
  •  జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని తెలిపిన అధికారులు.
  •  ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలించామన్న అధికారులు.
  •  దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని వెల్లడి. 
  •  కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని వెల్లడి.
  •  సీఎం ఆదేశాల మేరకు అంబేద్కర్‌ స్మృతి వనానికి దారితీసే రోడ్లను సుందరీకరిస్తామని తెలిపిన అధికారులు.
  •  ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
  •  నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలన్న సీఎం.
  •  అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలన్న సీఎం.
  •  పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న సీఎం.
  • ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Back to Top