అబ్దుల్‌ నజీర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుంది

నూత‌న గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. న్యాయనిపుణులైన జస్టిస్‌ నజీర్‌ అనుభవం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ఉపయోగపడుతుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
 

Back to Top