రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది

రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోద‌ర సోదరీమణుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు 

తాడేప‌ల్లి: నెల రోజుల‌పాటు అత్యంత నియ‌మ నిష్ట‌ల‌తో క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించే ఈ పుణ్య‌ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అన్నారు.  ముస్లింల‌కు ఎంతో పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. 

నెల రోజుల‌పాటు అత్యంత నియ‌మ నిష్ట‌ల‌తో క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించే ఈ పుణ్య‌ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని  అన్నారు.

మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ది రంజాన్ మాసంలోనే కావ‌డంతో ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్య‌త‌‌నిస్తార‌న్నారు. 

మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్ అని తెలిపారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుందని తెలిపారు. 

కఠిన  ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు  దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారన్నారు.  వారికి అల్లాహ్ దీవెన‌లు ల‌భించాల‌ని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Back to Top