చేనేత‌ల క‌ష్టాల‌ను కళ్లారా చూశా

నేత‌న్న‌లకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి:  జాతీయ చేనేత దినోత్స‌వం సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేనేత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. చేనేత‌ల క‌ష్టాల‌ను నా 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైయ‌స్ఆర్‌ నేత‌న్న నేస్తం ప‌థ‌కం ద్వారా అర్హుల‌కు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండ‌గా ఉంటున్నాం. నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top