మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
14న పోలవరానికి సీఎం వైయస్ జగన్
10 Jul 2021 3:57 PM
తాడేపల్లి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేయించాలని సీఎం వైయస్ జగన్ దృఢసంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీన పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలవరం పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
సీఎం వైయస్ జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా.. ఏర్పాట్లపై పోలవరం సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.