టంగుటూరి ప్ర‌కాశం పంతులుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టంగుటూరి  చిత్రపటానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌, ఎమ్మెల్సీ త‌ల‌శిల‌ రఘురామ్, వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల‌ అప్పిరెడ్డి పాల్గొని ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. 

Back to Top