మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం వైయస్ జగన్ భారీ ఆర్థిక సహాయం
25 Sep 2021 10:34 AM
రూ.35 లక్షల చెక్కును అందించిన ముఖ్యమంత్రి
పర్వతారోహణపై తుకారామ్కు అభినందన
హైదరాబాద్: తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అతడి సాహస యాత్రను మెచ్చుకున్న సీఎం వైయస్ జగన్ భారీ ఆర్థిక సహాయం అందించారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్ ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.
ఈ క్రమంలో ఏపీలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైయస్ జగన్ను తుకారాం కలిశాడు. తన పర్వతారోహణ వివరాలు తెలిపాడు. అభినందించిన అనంతరం తుకారామ్కు సీఎం జగన్ రూ.35 లక్షల చెక్కును అందించారు. ఏపీ సీఎం తనపై చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని తుకారామ్ తెలిపాడు.