వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్పై సీఎం సమీక్ష
01 Jun 2020 2:38 PM
ఆర్బీకే పరిధిలో పంటలపై మ్యాపింగ్ చేయాలి
వ్యవసాయ సలహా బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
తాడేపల్లి: పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్ విధానంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పంటలపై మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మార్కెట్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని, ఇ–క్రాపింగ్ గైడ్లెన్స్, ఎస్ఓపీలను వెంటనే తయారు చేయాలన్నారు.
ఇ–క్రాపింగ్ విధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పెట్టాలని, ప్రభుత్వం 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిశ్చయించిందన్నారు. మిగతా 70 శాతం పంటలు అమ్ముడయ్యేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఇ– మార్కెటింగ్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు ఉండాలన్నారు. ఇ– మార్కెటింగ్ మీద పంటను అమ్మాలంటే నాణ్యత చాలా ముఖ్యమని, ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తేవాలన్నారు. వచ్చేకాలంలో జనతా బజార్లకు ఈవిధానాలు దోహదపడతాయన్నారు.