విప్లవాత్మక నిర్ణయాలతో రైతులకు మేలు చేస్తున్నాం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర ఇవ్వడంతో పాటు, జీఎల్టీ రూపంలో క్వింటాలుకు సుమారు రూ.250లపైనే అదనంగా రైతులకు లభిస్తోంద‌న్నారు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలతో రైతులకు మేలు చేస్తున్నామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలని ఆదేశించారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు వివరించిన అధికారులు.

–జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదు. 
–    అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం. దీనివల్ల 73 శాతం మేర సాగు. 
–    ఈ ప్రాంతాల్లో ముందస్తు రబీకి సిద్ధం అవుతున్న రైతులు. 
–    దాదాపు 10 లక్షల ఎకరాల్లో ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందన్న అధికారులు.
–    శెనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు వెల్లడి.
–    రబీలో సాగుచేసే శెనగ విత్తనాలపై సబ్సిడీని 25% నుంచి 40%కు పెంచామన్న అధికారులు.
–    ప్రస్తుతం విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని వెల్లడి.
–    సుమారు 1 లక్ష క్వింటాళ్ల శెనగ విత్తనాలు సిద్ధంచేశామన్న అధికారులు.
–    ఇందులో ఇప్పటికే 45 వేల క్వింటాళ్ల పంపిణీ చేశామన్న అధికారులు.
–    ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్యాలేదని స్పష్టంచేసిన అధికారులు.
–    రైతుల అవసరాలకు తగిన విధంగా నిల్వలున్నాయని వెల్లడి.

ధాన్యం కొనుగోలుపై సీఎం సమీక్ష. 
–    ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే 85శాతం ఇ–క్రాప్‌ పూర్తిచేశామని వెల్లడించిన అధికారులు.
–    అక్టోబరు 15లోగా నూరుశాతం ఇ– క్రాపింగ్‌ పూర్తిచేస్తామని వెల్లడి.
–    ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు సమాయత్తమవుతున్నామన్న అధికారులు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:
–    ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
–    ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర ఇవ్వడంతో పాటు, జీఎల్టీ రూపంలో క్వింటాలుకు సుమారు రూ.250లపైనే అదనంగా రైతులకు లభిస్తోంది.
–    ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలతో రైతులకు మేలు చేస్తున్నామన్న సీఎం. 
–    ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలన్న సీఎం.
–    ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశం. 
–    ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం రాకూడన్న సీఎం.

–    ధాన్యంతోపాటు చిరుధాన్యాలనూ కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు.
–    ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు మిల్లెట్స్‌ సాగుచేస్తున్న రైతులకు తోడుగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
–    ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఏర్పాటు చేస్తున్న యూనిట్లను ఉపయోగించుకుని ఈ మిల్లెట్స్‌ను ప్రాసెస్‌ చేయాలన్న సీఎం. 
– ప్రతిఏటా రైతులనుంచి తృణధాన్యాలు కొనుగోలు పెరిగే అవకాశాలున్నందున ఆ మేరకు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం.
- పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలన్న సీఎం.
–    మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలన్న సీఎం.

–    ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశాలు.

–    వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఇప్పటివరకూ రూ.31,005.04 కోట్లు అందించిన శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం. 
–    ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలో డిఆర్‌ఓజీఓ– ఆర్‌టీపీఓ కేంద్రాల్లో ఔత్సాహికులైన వారికి కిసాన్‌ డ్రోన్లపై శిక్షణ.
–    ఇప్పటివరకూ 422 మందికి శిక్షణ అందించినట్లు తెలిపిన  అధికారులు.
–    నవంబర్‌ మూడోవారం నాటికి నాటికి మండలానికి ఒకరికి చొప్పున శిక్షణ పూర్తవుతుందన్న అధికారులు.
–    వీరిద్వారా మిగతా వారికి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపడతామన్న అధికారులు. 

–    ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలన్న సీఎం.
–    దీనికి అవసరమైన పరికరాలు ఆర్బీకేల్లో ఉంచేలా చూడాలన్న సీఎం.
–    దీనికోసం అవసరమైన ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం.
–    పంట వేసే ముందు భూసార పరీక్షలు జరగాలని, ఆమేరకు సర్టిఫికెట్‌ ఇచ్చేలా ఉండాలన్న సీఎం.
–    భూసార పరీక్షల ఆధారంగా ఏ పంటలు వేయాలి? ఏయే రకాల ఎరువులు ఎంత మోతాదులో వేయాలన్న దానిపై రైతులకు పూర్తి వివరాలు అందించేలా ఉండాలన్న సీఎం.
–    దీనివల్ల అవసరమైనంతమేరకే ఎరువులను వినియోగిస్తారని, రైతులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయన్న సీఎం.

– చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాలన్న సీఎం.
–    సుస్థిర జీవనోపాధి మార్గాలు ఏర్పాటుకావాలని, దీనిపై నిరంతరం సమీక్ష జరగాలన్న సీఎం.
–    చేయూతకింద ఇస్తున్న డబ్బుకు అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.
–    అవి విజయవంతంగా నడిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న సీఎం.
–    అమూల్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలామంది లబ్ధి పొందుతున్నారన్న అధికారులు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం.
–    వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతంగా నడవాలన్న సీఎం. 

–    పశుగ్రాసం, దాణా కొరతలేకుండా చూసుకోవాలన్న సీఎం.
–    ప్రతి ఆర్బీకేని యూనిట్‌గా తీసుకుని టీఎమ్మార్‌ ఇచ్చేలా చూడాలన్న సీఎం.

Back to Top