అమరావతి: ప్రతి జిల్లాలో ఒక ఎయిర్ పోర్టు ఉండాలన్నది మంచి కాన్పెప్ట్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలను అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహణలోఉన్న విమానాశ్రయాలు 6, తిరుపతి, కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్ వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్పోర్టు ఉండాలి దానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి : అధికారులకు సీఎం ఆదేశం అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలి ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టండి : బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్వే అభివృద్ధి చేయాలి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలి ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్న సీఎం నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టండి దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయండి నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలి గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం రద్దీకి తగినట్లుగా మౌలికసదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలన్న సీఎం సీపోర్టులు పైనా సీఎం సమీక్ష రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్భర్ల పనుల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలన్న సీఎం పనులు వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయన్న అధికారులు ఫిషింగ్ హార్భర్లు 9 ఫిషింగ్ హార్భర్లలో తొలిదశలో నిర్మాణం చేపడుతున్న 4 ఫిషింగ్ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు తొలిదశలో ఉప్పాడ(తూర్పుగోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా), జువ్వలదిన్నె(నెల్లూరు) జిల్లాల్లో ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం రెండో విడతలో చేపడుతున్న మిగిలిన 5 హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామన్న అధికారులు ఈ 5 ఫిషింగ్ హార్భర్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామన్న అధికారులు ఫేజ్ 2లో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప(పశ్చిమగోదావరి), ఓడరేవు(ప్రకాశం), కొత్తపట్నం(ప్రకాశం) జిల్లాలలో నిర్మాణం కానున్న ఫిషింగ్ హార్భర్లు ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, సీఎఫ్ఎస్ఎస్ సీఈఓ రవిసుభాష్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సలహాదారు వీ ఎన్ భరత్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.